పోస్ట్‌లు

డి కె అరుణకు ఎమ్మెల్యే గా గుర్తింపు

  హైదరాబాద్, సెప్టెంబర్ 4: గద్వాల నియోజకవర్గం నుంచి డి కె అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. వెంటనే గెజిట్​ను పబ్లిష్ చేయాల్సిందిగా.. అసెంబ్లీ కార్యదర్శికి, ప్రభుత్వ కార్యదర్శికి, తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్​రాజ్​కు కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది.

పోటెత్తిన శ్రీరాం సాగర్ ...

హైదరాబాద్గ, సెప్టెంబర్త 4: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి.. దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.7 టీఎంసీలతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.